షాద్నగర్, జనవరి 31 : షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు ఇచ్చే క్రమంలో బుధవారం ముగ్గరు సభ్యులతో కూడిన న్యాక్ అధికార బృందం కళాశాలను పరిశీలించారని ప్రిన్సిపాల్ ఎల్ కమల తెలిపారు. కళాశాలలో నిర్వహించే సేవా కార్యక్రమాలు, తరగతుల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభ, ఉత్తీర్ణత శాతం, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నాయకత్వ లక్షణాలు, కళాశాల నిర్వహణ తీరు , మొక్కల పెంపకం వాటర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ల నిర్వాహణ తదితర వివరాలను సేకరించారని తెలిపారు.
న్యాక్ బృంద చైర్మన్గా డాక్టర్ బద్ధిన్ గోగోయ్, కో ఆర్డినేటర్గా డాక్టర్ రాజేష్, సభ్యులుగా డాక్టర్ రాజేంద్ర కులకర్ణి కళాశాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వారిలో ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భాను ప్రకాష్, అధ్యాపకులు డాక్టర్ రవీందర్రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.