నందిగామ : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలోని అయ్యప్పటేంపుల్ నుంచి జంగోనిగూడ గ్రామం వరకు రూ. 2కోట్ల 50 లక్షల సీఆర్ఆర్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ గురువారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేస్తున్నమని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రానున్న రోజుల్లో గ్రామాలు మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేక్కోండ కుమార్గౌడ్, వార్డు సభ్యులు జంగ సింధు, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కృష్ణ, కుమారస్వామిగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ రజినీకాంత్, నాయకులు మెండె కృష్ణ, నర్సింహా, రాజు, రాములు గ్రామస్తులు పాల్గొన్నారు.