మంచు బాబోయ్.. మంచు.. బయటకు రావాలంటేనే గొడుగులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.. చిరుజల్లులా కురుస్తున్న మంచుకు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం ఆదివారం తడిసి ముద్దయ్యింది. ఎటు చూసినా పొగ మంచే.. దారి కనిపించక అవస్థలు పడ్డారు.
పొలాలు, రోడ్లను మంచు కప్పేసింది. పొలాల వద్దకు వెళ్లే రైతులు అవస్థలు పడ్డారు. రోడ్లను పూర్తిగా మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక లైట్లు వేసుకుని వెళ్లారు. కొందరు వాహనదారులైతే రోడ్డు పక్కన వాహనాలను నిలుపుకొని మంచు తగ్గాక వెళ్లడం కనిపించింది.
చేవెళ్ల రూరల్ : రేగడిఘనాపూర్ ప్రధాన రోడ్డులో..
మంచు దుప్పటి
చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లోని పలు గ్రామాలో ఆదివార పొగమంచు కమ్ముకుంది. ఉదయం 7:30 వరకు కూడా సూర్యుడు కనిపించలేదు. అంతారం, రేగడిఘనాపూర్, పర్వేద, రామాంతపూర్ తదితర గ్రామాల్లో మంచు కమ్ముకోవడంతో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొన్నది. రైతులు పొలాలకు, ప్రజలు వాహనాలకు లైట్లు వేసుకొని వారి పనులు చేసుకోక తప్పలేదు. యువత పొగ మంచులోనూ వాకింగ్, వ్యాయామం చేశారు.