కడ్తాల్ : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ (సీత్లా) పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో తీజ్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజులపాటు నిర్వహించే తీజ్ ఉత్సవాల్లో భాగంగా, మొదటిరోజు గ్రామంలోని యువతులు, గ్రామస్తులు కులదేవత ‘సీత్లా’కు ప్రత్యేక పూజలు చేశారు. తీజ్ ఉత్సవాలు నిర్వహించే ప్రదేశంలో బుట్టలో వేసిన గింజలకు, ధాన్యానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచేలా, రెండేళ్లకోసారి తీజ్ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పండుగలకు ప్రాధాన్యతను ఇస్తున్నదని పేర్కొన్నారు. ఈ నెల 22న తీజ్ వేడుకల్లో భాగంగా భారీ ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు హంశ్యమోత్యానాయక్, యాదయ్య, ఉప సర్పంచ్ శారద, పీఏసీస్ డైరెక్టర్ సేవ్యానాయక్, నాయకులు శ్రీనునాయక్, శంకర్, మోత్యానాయక్, భీమన్నాయక్, భీక్యానాయక్, రూప్సింగ్, ధర్మానాయక్, పంతు, సోమ్లా, రవి, చందర్ పాల్గొన్నారు.