రంగారెడ్డి, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమించడంతో రోగాలు దరి చేరడంలేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుండగా.. ‘పల్లె, పట్టణ ప్రగతి’తో ఊరూరా పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. ఫలితంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్య శాఖ ఏటా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. దోమలు, లార్వాలను నిలువరించే చర్యలను చేపట్టడంతోపాటు ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందజేస్తున్నారు. వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా కలిసొచ్చింది. గత రెండేండ్లలో చికున్గున్యా, మెదడు వాపు కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. మొత్తం 5 లక్షల రక్త నమూనాలను పరిశీలించగా ఒకేఒక్క మలేరియా కేసు నమోదైంది. కాగా, ప్రభుత్వం రూ.476కోట్లను వెచ్చించి రంగారెడ్డి జిల్లాలో 1,072 ఆవాసాలకు శుద్ధమైన మిషన్ భగీరథ జలాలను అందిస్తున్నది. అలాగే ప్రజారోగ్య రక్షణకు ఇప్పటివరకు రూ.657.24కోట్ల మేర నిధులను వెచ్చించింది.
ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే పల్లె, పట్టణాలన్నీ రోగాలతో వణికిపోయేవి. దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలతోపాటు మలేరియా, డెం గీ, చికున్గున్యా వంటి సీజన్ వ్యాధులతో ప్రజ లు సతమతమయ్యేది. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు పేషంట్లతో కిక్కిరిసేవి. అయితే రాష్ట్ర ప్ర భుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకం, పల్లె ప్రగతి కార్యక్రమంతో గణనీయమైన మా ర్పులు వచ్చాయి. ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందడంతో కలుషితం అనే మాటే ఇప్పుడు వినబడటం లేదు. గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛత వైపుగా అడుగులు వేస్తున్నాయి. రోగాల జాడ సై తం లేకుండా పోయింది. ప్రజలు అత్యవసరమై తే తప్ప.. దవాఖానలకు వెళ్లడంలేదు. జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.657.24 కోట్ల మే ర నిధులను వెచ్చించింది. అలాగే మిషన్ భగీర థ పథకానికి రూ.476 కోట్లను వెచ్చించి 1,072 ఆవాసాలకు శుద్ధమైన జలాలను అందిస్తున్నది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న డెంగీ కేసులు రెండంకెలకు తగ్గాయి. మలేరియా కేసులూ గత రెండేండ్లలో ఒక అంకెకే పరిమితమయ్యాయి. చికున్గున్యా, మెదడువాపు వ్యాధులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన నాలుగేండ్లలో మరణాలు సంభవించలేదు.
ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు..
ప్రభుత్వం ప్రతి ఏటా ప్రజారోగ్యం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది. గచ్చిబౌలిలోని టిమ్స్ దవాఖాన, కొండాపూర్లోని వంద పడకల జిల్లా దవాఖాన, వనస్థలిపురంలోని ఏరి యా దవాఖానలతోపాటు మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానలు కార్పొరే ట్ ఆస్పత్రులకు దీటుగా రోగులకు సేవలందిస్తున్నాయి. వీటితోపాటు జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 59 బస్తీ దవాఖానలు, 82 పల్లె దవాఖానలు కూడా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కట్టడికి జిల్లా వైద్యశాఖ ప్రతి ఏటా పటిష్ట ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. దోమలు, లార్వాలను నిలువరించే చర్యల ను చేపట్టడంతోపాటు ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందుల ను అందజేస్తున్నారు. విలేజ్ హెల్త్ రిజిస్టర్ను రూపొందించి ఇప్పటికే 1,78,734 కుటుంబాల ఆరోగ్య సమాచారాన్ని సేకరించిన వైద్యశాఖ ఆయా కుటుంబాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి ఆరోగ్య సేవలను అందిస్తున్నది. అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలకెళ్తే పరీక్షలు, మందులు అంటూ గతంలో తడిసి మోపయ్యేది. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం చేరువయ్యాక సీజనల్ వ్యాధుల బాధ తొలగడంతోపాటు జేబులకు చిల్లులు పడే పరిస్థితులకు చెక్ పడింది.
మిషన్ భగీరథతో శుద్ధ జలాలు
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకు తగ్గట్టుగా జిల్లాలో అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం, పల్లె ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మిషన్ భగీరథ పథకంలో అందిస్తున్న శుద్ధ జలాలు దాహార్తితోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంతంలో ఉన్న యెల్లూరు రిజర్వాయర్ నుంచి సేకరించిన నీటిని ముచ్చెర్ల(కందుకూరు), అంతారం(షాబాద్), కమ్మదానం(షాద్నగర్), కల్వకుర్తిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఇండ్లకు సరఫరా చేస్తున్నారు. రూ.476 కోట్ల నిధులు వెచ్చించి జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న 1,0 72 ఆవాసాలకు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నూతనంగా 877 వాటర్ ట్యాంకులను నిర్మించి 3,236 కిలోమీటర్ల మేర పైపులైన్లు కూడా వేశా రు. ఇంటింటికీ నీరందించే ఉద్దేశంతో 2,94,705 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. భూగర్భజలాలు అడుగంటి బోరు, బావులు, ట్యాంకర్ల ద్వారా సరఫరా అయిన నీటిని తాగి ఇబ్బందులు పడ్డ ప్రజలు మిషన్ భగీరథ నీళ్లొచ్చాక సమస్యల నుంచి విముక్తి పొందారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు.
అపరిశుభ్రతకు చెక్ పెట్టిన పల్లె ప్రగతి
పల్లె ప్రగతి కార్యక్రమంతో అనేక గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలకు మోక్షం లభించింది. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమివ్వడంతో రోడ్లపై పారే మురుగునీటి దృశ్యాలు కనుమరుగై స్వచ్ఛత సంతరించుకున్నది. ప్రభుత్వం ఏటా ఆర్థిక సంఘం నిధుల కింద రూ.3,33 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి రూ. 78,37 కోట్లతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద ప్రత్యేక నిధులను జిల్లాలోని 580 గ్రామపంచాయతీల కు విడుదల చేస్తున్నది. అలాగే పల్లె ప్రగతి ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీలకు రూ. 657,24 కోట్లను సర్కారు అందించింది. ఈ నిధులతో అధికారులు శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయడంతోపాటు పాడుబడిన బావులను పూడ్చారు. రోడ్లపై నీరు నిలుస్తున్న ప్రదేశాలతోపాటు పెద్ద గుంతల్లో మట్టిపోసి సరి చేశారు. పేరుకుపోయిన చెట్ల పొదల తొలగింపు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీహెచ్ సీ ఆవరణలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి ఉందా? ఉంటే వినియోగిస్తున్నారా! తదితర విషయాలను పరిశీలించారు. ఈ చర్యలతో పల్లెల్లో అపరిశుభ్రత అనేదే లేకుండా పోయింది.
తగ్గుముఖం పట్టిన రోగాలు
గతంతో పోలిస్తే గడిచిన నాలుగైదు ఏండ్లలో జిల్లాలో రోగాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, సైన్ఫ్లూ, డెంగీ, కలరా, డయేరియా, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు చుట్టుముట్టేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. 2022 లో 711 డెంగీ కేసులు నమోదుకాగా.. 2023లో ఆ సంఖ్య 27కి తగ్గింది. 2020లో ఒక్క మలేరియా కేసు, 2021లో మూడు కేసులు, 2022లో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది లో 1,74,268 రక్త నమూనాలను పరీక్షిస్తే ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలే దు. రెండేండ్లలో చికున్ గున్యా, మెదడు వా పు వ్యాధులకు సంబంధించి ఒక్క కేసు కూ డా లేకపోవడం గమనార్హం. నాలుగేండ్లలో వ్యాధుల బారిన పడి మరణించిన దాఖలాలు ఒక్కటీ లేదు.