సీఎం కేసీఆర్ సుపరిపాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ‘పల్లె ప్రగతి’ కింద ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించారు. నిత్యం మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ చేపడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రతి పల్లె చూడచక్కగా దర్శనమిస్తున్నది. పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనలో మన గ్రామాలు జాతీయ స్థాయిలో మెరుస్తున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా, వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలోని చీమలదరి గ్రామాలను కేంద్రం ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపిక చేయగా.. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్లు నర్సింహారెడ్డి, సరితలకు అవార్డులను అందజేసి సత్కరించింది.
-మోమిన్పేట/నందిగామ, ఏప్రిల్ 17
మోమిన్పేట, ఏప్రిల్ 17 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు ప్రగతిపథంలో పరుగులు తీస్తున్నారు. ప్ర భుత్వం పల్లెప్రగతి కార్యక్రమం క్రింద కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వరిస్తున్నాయి. ప్రభు త్వం కేటాయించిన పల్లెప్రగతి నిధులతోపాటు సర్పం చ్ నర్సింహారెడ్డి ప్రత్యేక కృషితో మండలంలోని చీమలదరి గ్రామం సకల సౌకర్యాలతో మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిన్నది. దీంతో గ్రామం సుపరిపాలనలో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో కేంద్ర పంచాయ తీరాజ్శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ చౌహాన్, రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా సర్పంచ్ నర్సింహారెడ్డి, కార్యదర్శి సుగుణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు చీమలదరి గ్రామం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకున్నది.
కన్హా గ్రామానికి కూడా..
నందిగామ : రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామ పంచాయతీకి కూడా జాతీయ స్థాయి అవార్డు లభించింది. పర్యావరణం, ప్రకృతివిభాగంలో రాష్ట్రం నుంచి కా ర్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ అవార్డుకు ఎం పికైంది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో కేంద్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి గిరిరాజ్సింగ్ చౌహాన్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు చేతులమీదుగా కన్హా గ్రామ సర్పంచ్ సరిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసినందు కు వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డు రావడం సంతోషంగా ఉన్నది
సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన పల్లెప్రగతి నిధులతోపాటు ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా. కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును అం దుకోవడం చాలా సంతోషంగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, స్థానికుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
-నర్సింహారెడ్డి, సర్పంచ్ చీమలదరి