పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్రెడ్డి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటం ఎడ్లబండిలో ఉంచి ర్యాలీ చేపట్టారు. వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం పట్లూరులో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని గ్రామంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్, దేవర్ఫస్లాబాద్ గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గం డాపూర్ మండలం వీరాపూర్లో రైతుబంధు ఉత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొనడం జరిగింది. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఎడ్లబండ్ల ర్యాలీ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి ఉత్సాహంగా ఉత్సవాలు నిర్వహించారు.