షాద్నగర్టౌన్ : నూతన పట్టా పాసుపుస్తకం కలిగిన వారు, గతంలో రైతు బీమా చేసుకోని ప్రతి ఒక్కరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఫరూఖ్నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు బీమాకు 18నుంచి 59ఏండ్లు ఉన్నవారే అర్హులని తెలిపారు. ఈ నెల 11వరకు ప్రతి రైతు తమ ఏఈఓలకు భూమి పాస్ పుస్తకం, ఆధార్కార్డు నామినీ ఆధార్కార్డు జిరాక్స్లను ఇవ్వాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.