రంగారెడ్డి, డిసెంబర్ 30, (నమస్తే తెలంగాణ): యాసంగి సాగు కోసం రైతుబంధు పథకం డబ్బులు మూడో రోజు గురువారం మూడు ఎకరాల భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.ఐదు వేల చొప్పున రైతుబంధు డబ్బులు జమ కాగా, రెండో రోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు, గురువారం మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను అధికారులు జమ చేశారు. మొదటి రోజు 96,142 మంది రైతులకు రూ.28.04 కోట్ల రైతుబంధు సాయం, రెండో రోజు 79,083 మంది రైతులకు రూ.56.71 కోట్ల సాయాన్ని, మూడో రోజు 43,047 మంది రైతులకు రూ. 53.12 కోట్ల ప్రభుత్వ సాయాన్ని అధికారులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 42,942 మందికి ..
వికారాబాద్ జిల్లాలో పెట్టుబడి సాయం డబ్బులు మూడో రోజు గురువారం మూ డు ఎకరాల భూమి ఉన్న రైతుల బ్యాం కు ఖాతాల్లో జమ అయ్యాయి. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న 53, 772 మంది రైతులకు రూ.17,80, 57,562 జమ కాగా, రెండో రోజు 29వ తేదీన రెండు ఎకరాల భూమి ఉన్న 70,824 మంది రైతులకు రూ.51,85, 66,894, మూడో రోజు గురువారం మూడు ఎకరాల భూమి ఉన్న 42,942 మంది రైతులకు రూ. 53,65 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశా రు. మిగిలిన రైతులందరికీ మరో వారం, పది రోజుల్లో అందిస్తామని వారు తెలిపారు. యాసంగిలో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం సకాలంలో అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ధైర్యంగా బతుకుతున్నారు
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ ప్రత్యక్ష దైవమని షాద్నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మన్నె కవితానారాయణ అన్నారు. రైతుబంధు నిధుల విడుదలను హర్షిస్తూ గురువారం ఆమె షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రైతులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చిత్రపటానికి వడ్లతో అభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి పంటలు సాగు చేసే సమయంలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దని పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా బతుకుతున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, నాయకులు వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, మల్లేశ్యాదవ్, యాదయ్య, మన్నె నారాయణ, సంజీవయ్య, కృష్ణ, కిరణ్గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేని పథకాలను సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులు, ప్రజలు, అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్కున్నా, గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, స్థానిక పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, నాయకులు గోపాల్రెడ్డి, బాలకృష్ణ, పాండురంగారెడ్డి, భరత్రెడ్డి పాల్గొన్నారు.
దేశానికే దిక్సూచి రైతుబంధు పథకం
రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే దిక్సూచి అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలిలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్, పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, టీఆర్ఎస్ నాయకులు వశిష్ట, రఘుపతిరెడ్డి, మునీర్, బాల్రాజ్, అరుణ్కుమార్, రాఘవేందర్ పాల్గొన్నారు.
ఊరూరా క్షీరాభిషేకాలు
యాసంగి పంటల సాగుకు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్న వేళ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మండలంలోని సాలిండాపూర్, బురాన్పూర్, టేకులగడ్డతండా, సూర్యానాయక్తండా, బొంరాస్పేట, దుద్యాల, గౌరారం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీపీ హేమీబాయి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, పార్టీ సీనియర్ నాయకుడు దేశ్యానాయక్, రైతులు పా ల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కేసీఆర్ ప్రతి ఏడాది రెండు విడుతలుగా రైతులకు పెట్టుబడి సాయాన్నిఅందించి ఆదుకుంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్గౌడ్, మహేందర్, ఎంపీటీసీలు శ్రవణ్గౌడ్, సుదర్శన్రెడ్డి, ఎల్లప్ప, నెహ్రూనాయక్, నర్సింహ, రాథోడ్, రైతులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు గురువారం రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అర్జున్రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సత్యం, డైరెక్టర్ సుభాశ్, బాలస్వామి, వెంకట్రెడ్డి, శంకర్, నరేందర్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి సీఎం కృషి
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములుయాదవ్ అన్నారు. యాసంగి సాగుకు సంబంధించిన రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడాన్ని హర్షిస్తూ గురువారం ఆయన టీఆర్ఎస్ నాయకులు, ప్రజలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజాపాషా, నాయకులు సుధాకర్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, బల్వంత్రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్, ఖలీమ్పాషా, ప్రవీణ్, మల్లారెడ్డి, వెంకటయ్య, నాగరాజు, రాజు నర్సింహులు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని పండుగలా చేశారు..
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావడాన్ని హర్షిస్తూ గురువారం వారు టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, సర్పంచ్లు శ్రీనివాస్, రత్నం, ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పురాజు, డైరెక్టర్ ఆంజనేయులు, నర్సింహారెడ్డి, రాజు, డేవిడ్, పరమేశ్, ఆంజనేయులు, రాములు, సునీల్, రమేశ్, కిరణ్, మిట్టు పాల్గొన్నారు.