చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : దాతల సహకారంతో హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కుమ్మెర గ్రామ సర్పంచ్ భానుతేజ తెలిపారు. మండల పరిధిలోని కుమ్మెర హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి రూ.6 లక్షల 25 వేల చెక్కును విరాళంగా హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భానుతేజ మాట్లాడుతూ..హనుమాన్ ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.