ఇబ్రహీంపట్నం, నవంబర్ 28 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని, ఎన్నికల ముందు వచ్చే అవకాశవాదులను ఓడించాలని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామంలో ఆయన ఎన్నికల రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని ఏనాడు కోరుకోలేదని, అభివృద్ధి జరుగటం కూడా వారికి ఇష్టంలేదన్నారు. అభివృద్ధిని వ్యతిరేకించే కాంగ్రెస్కు ఓటేస్తే మల్లీ చీకటిరోజులు వస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, నోముల కృష్ణ, రైతుసంఘం నాయకులు మొద్దు అంజిరెడ్డి, కౌన్సిలర్లు అల్వాల జ్యోతి, నరాల విశాల, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, సహకారసంఘం ఉపాధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి మరోసారి పట్టం కట్టడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తీర్మానించారు. ఈ మేరకు ఎంఎంగార్డెన్లో పలు కాలనీలకు చెందిన మహిళలు, బీఆర్ఎస్ నేతలు తీర్మానించారు. ఇబ్రహీంపట్నం కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, నాయకులు బుగ్గరాములు, రవీందర్ పాల్గొన్నారు.
యాచారం : అవినీతి కాంగ్రెస్ను ఓడించి అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్న బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సాయంత్రం నిర్వహించిన రోడ్షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. యాచారంలో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం తిరిగి యాచారంలోనే ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. యాచారం అభివృద్ధికి సుమారు మూడు కోట్ల నిధులను మంజూరు చేశానన్నారు. ఫార్మాసిటీతో మండలానికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. మల్రెడ్డికి ఓటేస్తే పూలు, పండ్లు చివరకు టీ కొట్టులను కూడా వదలకుండా వసూళ్లు చేస్తాడన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ జంగమ్మ, బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్లు ఉదయశ్రీ, సంతోష, నాయకులు బిలకంటి శేఖర్రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్చారి, ఖాజు, జానీ, గోపాల్, వెంకటేశ్ తదితరులున్నారు.
తుర్కయంజాల్ : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే రాష్ట్రం పదేండ్లు వెనక్కి వెళ్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎన్నికల ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య,రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు కల్యాణ్ నాయక్, నారని కవి త, కోఆప్షన్ సభ్యులు కాకుమాను మరియమ్మ చిన్నయ్య, పోరెడ్డి నర్సింహారెడ్డి నాయకులు చంద్రశేఖర్రెడ్డి, రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.
ఆదిబట్ల : సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ గెలువాలని ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీ పటేల్గూడ గ్రామంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పొట్టి శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోరే కళమ్మ, కౌన్సిలర్లు నారని మౌనిక, బీఆర్ఎస్ నాయకులు కోరే జంగయ్య, పాతూరి రాజేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి గెలిపించాలని ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, సర్పంచ్లసంఘం అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. తొర్రూర్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా వైఎస్సార్ నగర్ కాలనీలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చెవుల దశరథ, మేతరి అశోక్, దాస్ గౌడ్, విజయానంద్రెడ్డి, కొత్తకుర్మ శ్రీశైలం, మేతరి శంకర్, వస్పరి బాబయ్య, శ్రీనివాస్, రవి, నర్సింహ్మ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : బీఆర్ఎస్ ప్రచారం మంగళవారం ముమ్మరంగా కొనసాగింది. పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దండెం రాంరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కంచర్ల సత్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు చెరుకూరి జగన్, బాలకృష్ణగౌడ్, సత్తార్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిపల్లిలో కౌన్సిలర్ పాశం అర్చన దామోదర్ ఆధ్వర్యంలో, ఇందు పల్లవి అపార్టుమెంట్లలో కౌన్సిలర్లు రోహిణి బ్రహ్మానందదారెడ్డి ఆధ్వర్యంలో, ఆర్కేనగర్, వివిధ కాలనీల్లో కౌన్సిలర్ పరశురాంనాయక్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటు ౦యాలని కోరారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసిన ఘనత మంచిరెడ్డి కిషన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. పెద్దఅంబర్పేటలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాయి.
సోమవారం రాత్రి తారామతిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి రోడ్షో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చేగూరి వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ గోశిక నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి బుచ్చిబాబు, మాజీ సర్పంచ్ రాజ్కుమార్, చేగూరి భరత్, సతీశ్గౌడ్, పాండు, అశోక్, కృష్ణ, బీరప్ప, బాలయ్య, మధు, శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మంచాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంచిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జంబుల కిషన్రెడ్డి, మొగిలి వెంకటేశ్, దండేటికార్ సత్యనారాయణ, రాజేశ్ పాల్గొన్నారు.