ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శాస్ర్త గార్డెన్ నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా మంగల్పల్లి వరకు రూ.58కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని రాయపోల్, తూప్రాన్పేట్, ఆగాపల్లి, కందుకూరు ఎక్స్రోడ్డు, గున్గల్ లోయపల్లి, ఇబ్రహీంపట్నం రంగాపూర్తో పాటు అన్ని గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.