షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో నిర్వహించిన ఫరూఖ్నగర్ మండలం, షాద్నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల విసృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలను అమ్మడం, ఇష్టానుసారంగా ధరలను పెంచడం, సామాన్య ప్రజలకు కుచ్చుటోపి పెట్టడం తప్పా దేశానికి బీజేపీ ఒరగబెట్టింది ఏమి లేదని దుయ్యబట్టారు. ఈ ఏడు యేండ్లలో కనీసం లక్ష ఉద్యోగాలైన దేశ ప్రధాని నరేంద్రమోది వేశారా ? అని ప్రశ్నించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే బీజేపీలు పాదయాత్రలు, సభలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పాలనపై అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.
నూతన కమిటీల ఎన్నిక..
ఫరూఖ్నగర్ మండల టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్నాయక్ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రకటించారు. అదే విధంగా మండల మహిళా అధ్యక్షురాలిగా చిల్కమరి మాజీ సర్పంచ్ సుష్మరెడ్డిని నియమించారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎంఎస్. నటరాజన్ మరోమారు ఎన్నికయ్యారని తెలిపారు. మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శిగా చీపిరి రవియాదవ్ నియమితులయ్యారని అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీలను నియమిస్తారని వివరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులు అభినందించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, కమిటీ ఎన్నికల ఇన్చార్జి నాగేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత నారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంబాల్నాయక్, రాజవరప్రసాద్, పాతూరి వెంకట్రావు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.