బడుగు, బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్కు దక్కుతుందని, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతిని ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రను వివరించారు. అన్ని వర్గాలకు హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చారన్నారు. రాజ్యాంగ పరిరక్షణే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
షాబాద్, ఏప్రిల్ 14 : రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కే దక్కుతుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలివెళ్తున్న వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. షాబాద్, శంకర్పల్లి మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, ఎంపీపీలు కోట్ల ప్రశాంతిరెడ్డి, మల్గారి విజయలక్ష్మి, గోవర్దన్రెడ్డి, గునుగుర్తి నక్ష్రత్రం, శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మీ, శివప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం : అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పట్నంలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తుర్కయాంజాల్ మున్సిపల్ కేంద్రంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలంతో పాటు మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మంచాల మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్యతో పాటు ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆగాపల్లి గ్రామంలో బహుజన వేదిక అధ్యక్షుడు మారయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో పలుపార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేశ్గౌడ్, పాశ్చబాష తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్ నియోజకవర్గంలో..
షాద్నగర్ : షాద్నగర్ మున్సిపాలిటీతో పాటు కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్నగర్, కొందుర్గు, నందిగామ, చౌదరిగూడ మండలాల్లో ఆయా గ్రామాల నాయకులు, సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ విగ్రహాల వద్ద, చిత్రపటాల వద్ద ఘన నివాళ్లు అర్పించి వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, దళిత, బహుజన సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తూరులో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యేతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆవిష్కరించారు. కేశంపేట మండల కేంద్రంలో ఎంపీపీ వై. రవీందర్యాదవ్, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, ఎంపీడీవో కార్యాలయం అధికారులు ఫరూఖ్నగర్ మండల పరిషత్ ఆవరణలో అంబేద్కర్కు నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేల సంఖ్యలో అభిమానులు హైదరాబాద్కు తరలివెళ్లారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఆమనగల్లు : అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల వ్యాప్తంగా జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి , సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్ గుప్తా, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు అర్జున్రావు, పత్యానాయక్, వివిధ సంఘాల నాయకులు వగ్గు మహేశ్, శ్రీకాంత్ సింగ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎంపీపీ నిర్మల అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కడ్తాల్ : అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ, గ్రామ పంచాయతీ పాలక మండలి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వెంకటేశ్గుప్తా, భాస్కర్రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, చందోజీ, హన్మానాయక్, యాదగిరిరెడ్డి, నరేందర్రెడ్డి, భిక్షపతి, అశోక్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
అంబేద్కర్కి ఘన నివాళి
ఆమనగల్లు, ఏప్రిల్14 : అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.