ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 5 : ప్రజలకోసం నిజాయితీగా పనిచేస్తే పదవులు వాటంత అవే వెతుక్కుంటూ వస్తాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన సత్తువెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రానివారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలిస్తున్నామని, పార్టీ పదవుల్లో కూడా మరింత మందికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. మార్కెట్ కమిటీతో సహా మరిన్ని పదవులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ జంగ మ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, నాయకులు అల్వాల వెంకట్రెడ్డి, సిద్దంకి కృష్ణారెడ్డి, కొప్పు జంగయ్య, పాశ్చబాష, వేణుగోపాల్రావు, మహేందర్, సురేశ్, రాజేశ్గౌడ్, జంగారెడ్డి, ఎంపీటీసీలు భరత్రెడ్డి, జ్యోతి, శివలీల, సర్పంచ్లు బండిమీది కృష్ణ, బల్వంత్రెడ్డి పాల్గొన్నారు.
రెండు వంతెనలకు త్వరలో టెండర్లు
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలోని చాకర వాగు, చెన్నవాగు వద్ద బ్రిడ్జీల నిర్మాణం త్వరితగతిన చేపట్టి వచ్చే వర్షాకాలం నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం వారు క్యాంపు కార్యాలయంలో కిషన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. బ్రిడ్జీల నిర్మాణానికి రూ.5.5 కోట్లు మంజూరు చేయించడంపై సంతో షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు పోలేపల్లి రాము లు, రాచమల్ల సుధాకర్ పాల్గొన్నారు.
ఎల్లమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన
తుర్కయాంజాల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధి ఎస్సీ కాలనీలో ఎల్లమ్మగుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు కొత్తకుర్మ మంగమ్మ, కల్యాణ్ నాయక్, కీర్తన, మేతరి అనురాధ, రైతుసేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ డైరెక్టర్ మేతరి అశోక్, మాజీ సర్పంచ్లు కందాడి లక్ష్మారెడ్డి, చెవుల దశరథ పాల్గొన్నారు.