పెద్దఅంబర్పేట, జనవరి 27: పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని చిలుకూరు గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. ప్రజల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని.. వాటిని ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ పథకాలు కొనసాగుతున్నాయన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి వెలు గు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మమత, సర్పంచ్ గునుగుర్తి స్వరూప, డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్, కంటి వెలుగు కార్యక్రమ అధికారి అరుణాకుమారి, మండల వైద్యాధికారి వాణి, ఎంపీడీవో సంధ్య , సీహెచ్వో నర్సింగ్రావు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, హెల్త్ సూపర్వైజర్ ఉమామహేశ్వరి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, ఏఎంసీ డైరెక్టర్ భిక్షపతిగౌడ్, ఎంపీటీసీల ఫో రం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాంచందర్, నవీన్కుమార్, వెంకటేశ్, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
మందులు, అద్దాలు ఇస్తున్నారు..
‘కంటివెలుగు’ పేదలకు వరంలా మారింది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అండగా నిలిచారు. చాలామంది పేదలు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక అలాగే వారి జీవితాలను వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో కంటి వెలుగు క్యాంపులను ఏర్పాటు చేసి.. ఉచితంగా మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. – రాములు, బొంపల్లి గ్రామం, దోమ మండలం
దూరం చూపు కనిపిస్తున్నది..
మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షించిన వైద్యులు అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నా రు. దూరం చూపు మంచిగా కనిపించడం లేదని చెప్పడంతో పరీక్షించిన వైద్యులు కంటి అద్దాలు ఇచ్చారు. వాటిని పెట్టుకుంటే కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. – రాములు, ఎన్కతల, మోమిన్పేట