హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఐదు గ్రామాల్లో రూ. 3కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు. మండలంలోని తారామతిపేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తదితర గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్యార్డులు తదితర అభివృద్ధి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు చెప్పారు. కమ్యూనిటీ హాళ్లు కావాలంటూ యువత విజ్ఞప్తులు చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ముందుకువెళ్తామని పేర్కొన్నారు. మరోవైపు, డంపింగ్ యార్డులో రోడ్డుకు అవతలి వైపునకు మార్చాలని తారామతిపేట గ్రామస్తులు విజ్ఞప్తి చేశారని చెప్పారు.
స్థానికులు శ్రమదానంతో రోడ్డు పనులు చేపడితే.. డంపింగ్యార్డును మార్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆయ కార్యక్రమాల్లో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, తారామతిపేట సర్పంచ్లు స్వరూప, తుడుము మల్లేశ్, మహేశ్, గౌరెల్లి ఉపసర్పంచ్ వేముల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు ముద్దం వీరస్వామియాదవ్, జిల్లా సహకార బ్యాంకు కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్అక్బర్ అలీఖాన్ పాల్గొన్నారు.