కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మండలంలోని ఇంటింటికీ చేరవేసే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయలన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు మామిడి దామోదర్రెడ్డి, జనరల్ సెక్రెటరి వన్నం బాలరాజు, పెంజర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బీమయ్య, నాయకులు దేశాల లక్ష్మయ్య, రాజు, మల్లయ్య, రమేశ్, మాదవరెడ్డి పాల్గొన్నారు.