శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించగా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపడాని కొనియాడారు. మారుమూల గ్రామాలకు ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు అందించి గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు.
హరితహారం, పల్లెప్రకృతి వనాలతో ప్రస్తుతం ప్రతీ గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నదని చెప్పారు. 70 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. రూ. 75కోట్లతో గండిపేట్ చౌరస్తా నుంచి శంకర్పల్లి వరకు నాలుగు లైన్ల రోడ్లను నిర్మించారని అలాగే రూ. 13కోట్లతో రామంతపురం నుంచి చేవేళ్ల మండలం దేవరంపల్లి వరకు డబుల్ రోడ్డును నిర్మించారని తెలిపారు. చేవేళ్ల నియోజక వర్గంలోని షాబాద్, సీతారాంపూర్ గ్రామాల్లో పలు కొత్త ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి సీఎం కేసీఆర్ చొరవ చూపుతున్నారని చెప్పారు.
నియోజకవర్గంలోని ఈసీ, మూసీ నదులపై నాలుగు బ్రిడ్జిలు నిర్మించడానికి సీఎం నిధులు మంజూరు చేశారని చెప్పారు. శంకర్పల్లి, చేవేళ్ల మండలాల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. కాగా కొందరు పథకాలు తీసుకుంటూ సీఎంని నిందిస్తున్నారని ఇది చాలా దుర్మార్గం అన్నారు. కార్యకర్తలు సోషల్ మీడియలో ఇలాంటి వార్తలను ఖండించాలని చెప్పారు. కాగా మండలంలోని టంగటూరు, మోకిల గ్రామాల మధ్య మూసీ నదిపై బ్రిడ్జిని నిర్మించడానికి రూ. 4.50కోట్లు మంజూరు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మండల, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు కే.గోపాల్, వీ.వాసుదేవ్కన్నా, మున్సిపల్, మండల మహిళ అధ్యక్షులు అనిత, ఈ.శోభ, గౌరవ అధ్యక్షులు జీ.గోవర్ధన్రెడ్డి, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, నాయకులు ఎన్.మాణిక్రెడ్డి, సీహెహె గోపాల్రెడ్డి, సాత ప్రవీణ్కుమార్, మండల కార్యకర్తలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.