కొత్తూరు రూరల్ : యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో క్రైస్తవులు నడువాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్ గ్రామంలో గల అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన ఫాతిమా మాత చర్చిలో క్రైస్తవులు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ సిమోన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియచేశారు. మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో గల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసు ప్రేమ స్వరూపుడని, కరుణామయుడని యేసు చూపిన సన్మార్గంలో ప్రజలంతా నడువాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ, నాయకులు దేవేందర్యాదవ్, కృష్ణయ్యయాదవ్, జంగయ్యయాదవ్, నర్సింహగౌడ్, శ్రీశైలం, రవీందర్, బాలరాజు, దిలిప్రెడ్డి, అల్బీన్రెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.