షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పెద్ద జానమ్మపేట గోదాసమేత లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చన, సేవాకాలం, హోమం, పవిత్రారోషణ, నివేదన, విష్ణు సహస్రనామ పారాయణం, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమం, నివేదన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాలు నేటితో ముగుస్తాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాల్రాజ్, మోహన్రెడ్డి, నర్సింలు, ప్రతాప్రెడ్డి, మధు, సంతోష్, రాంభూపాల్ పాల్గొన్నారు.