బషీరాబాద్ : అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని రెడ్డి ఘణపూర్, అల్లాపూర్, నంద్యనాయక్తండా, ఎక్మాయి గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియ, గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాటిక నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, అధికారులు, గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతిరోజు విలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా చూడలన్నారు. అంగన్వాడీలు, వీఆర్ఏలు, సూపర్వైజర్లు డీఎల్వోలు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ వేయించుకొని వారి గుర్తించి వ్యాక్సినేషన్ చేయలన్నారు. ఈ విషయంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లైతే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయ గ్రామల ప్రజలకు సూచించారు. వైద్య సిబ్బందికి సహకరించి 18సంవత్సరాలు నిండిన వారంత వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. అలాగే ఆయా గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాటిక నిర్మాణాలను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉప తాసిల్దార్ వీరేశ్బాబు, ఎంపీవో రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు ఉన్నారు.