ఇబ్రహీంపట్నం : గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీఇందు కళాశాల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు కళాశాల సమీంపలోని వెనుకభాగంలోని శ్రీసాయిభవాని నగర్ వెంచర్ వద్ద సుమారు 36 ఏండ్లు ఉన్న వ్యక్తి మృత దేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వంటిపై గాయాలతో పాటు మెడ భాగాన్ని కూరగాయల కత్తితో కోసినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఏసీపీ బాలకృష్ణారెడ్డితో పాటు డాగ్స్వ్యాడ్స్, ఎస్ఓటీ పోలీసులు పరిసరాలను క్షుణంగా పరిశీలించారు.
హత్యకు సంబంధించిన వివరాల కోసం కూపీ లాగేందుకు సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణంగా పరిశీలించారు. మృతుడికి సంబంధించిన ఆదారాలు లేకపోవడంతో గుర్తుపట్టడం కష్టంగా మారిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.