పెద్దేముల్ : నాటు సారా తాయారు చేస్తున్న పన్నెండు మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుడుంబా(నాటు సారా) నిర్మూలనకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఆదేశాలతో తాండూరు పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా పెద్దేముల్ మండల పరిధిలోని మదనాంతపూర్, మన్సన్పల్లి, మారెపల్లి తాండాలలో తాండూరు, జిల్లా టాస్క్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించారు. సోదాలలో తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్, డీటీఎప్ సీఐ ధన్వంత్రెడ్డి, ఎసైలు సైదయ్య, చంద్రకాంత్రెడ్డి, కోటేశ్వరరావు, సిబ్బంది నాటుసారా తాయారీదారులతో పాటు అనుమానితులు పన్నెండు మందిని అదుపులోకి తీసుకొని తాసిల్దార్ ముందు బైండోవర్ చేశారు.