షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెరువుల్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతు పూడీక తీత పనులను చేపట్టడంతో భారీ వర్షాలకు చెరువులన్ని నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేప పిల్లలను చెరువుల్లో వదలడం వల్ల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన్నట్లు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చిలుకూరు సర్పంచ్ అండ్రూ, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు మంజుల, ఎంపీటీసీ రమ్య, పీఏసీఏస్ వైస్ చైర్మన్ మహేందర్, వార్డు సభ్యులు యాదమ్మ, వెంకటేశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాంచందర్, శ్రీరాములు, యాదయ్య, రాజు, విజయ్, నర్సింహా, నరేశ్, యాదయ్య, మల్లేశ్, రాఘవేందర్యాదవ్ తదితరులు ఉన్నారు.