షాద్నగర్ : వినియోగదారుల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆసరా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనల్లో మార్పురావాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తులు, తుకాలు, మార్కెట్, ధరలు, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
ఇందులో భాగంగానే ఆసరా సంస్థ ప్రతినిధులు రవి రాథోడ్, కృష్ణవేణి, సాయిజ్యోతిలు వినియోగదారుల పక్షాన చేస్తున్న సేవా కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. తాజాగా వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నారో తెలిపారు. ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు. వినియోగదారులను మరింత చైతన్యపర్చడమే లక్ష్యంగా ఆసరా సంస్థ పని చేస్తుందన్నారు.