షాద్నగర్ : దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుందన్నారు. ఎక్కడ సేవ చేసిన తెలంగాణ పేరును నిలబెట్టెలా పనితీరు ఉండాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సివిల్ ర్యాంకర్ డాక్టర్. శ్రీజను కోరారు. ఉప్పల్లోని చిలుకానగర్లో నివాసం ఉంటు సివిల్స్లో ఉత్తమ ప్రతిభను చూపిన శ్రీజను సోమవారం తన కార్యాలయంలో అభినందించిన సందర్భంగా మాట్లాడారు. సివిల్లో శిక్షణను విజయవంతంగా కొనసాగించాలని, శిక్షణ అనంతరం ప్రజలకు ప్రభుత్వ సేవలను సంపూర్ణంగా అందించాలని కోరారు.
సివిల్లో 20వ ర్యాంక్ సాధించడం గొప్పవిషయమని, నేటితరం విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. ఉస్మానియా దవాఖానలో డాక్టర్గా విధులు నిర్వహిస్తునే సివిల్లో రాణించడం అభినందనీయమని కొనియాడారు.