ఆమనగల్లు : అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రలుగా పరిగేత్తిస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకేళ్తున్న విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్ర రూపురేఖలు మారయన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులకు ఉన్న ఆటంకాలను క్లీన్ చేయాలని ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టలన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు త్వరలోనే సీఎం కేసీఆర్ తీపికబురు చేబుతారన్నారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ నేరవేర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 2కోట్ల ఉద్యోగాలను భర్తి చేస్తామని హామీ ఇచ్చిందని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను భర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12,769 పంచాయతీలో వైకుంఠధామాలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆడ్మిషన్ల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో విద్య వ్యవస్థల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 4వేల కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు.
వరిధ్యానం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు. రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్రోడ్డు (ఆర్,ఆర్,ఆర్) రాకతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.