చేవెళ్ల రూరల్ : ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం ఊరెళ్ల గ్రామంలో సర్పంచ్ జహంగీర్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటూ ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ విఠలయ్య, కార్యదర్శి, కారోబార్ శివయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈర్లపల్లి గ్రామంలో..
చేవెళ్ల మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామంలో ఎంపీటీసీ వనం మాధవిలక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కైల రాధ సుధాకర్రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, వార్డు సభ్యులు యాదయ్య, మానయ్య, మంజుల, టీఆర్ఎస్ నాయకులు యాదయ్య, దేవదాస్, ఎస్. మహిపాల్రెడ్డి, సీహెచ్. రవి, అంజిరెడ్డి, నిరంజన్, బందయ్య, కాంతిరెడ్డి, ఈశ్వరయ్య, రాజు, లింగం, మల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.