ఆమనగల్లు జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షతకు నిరసనగా సోమవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పల్లెపల్లెనా చావుడప్పును మోగించారు. ఆమనగల్లు మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడటం బాధకరం అన్నారు. వెంటనే తెలంగాణ రైతుల నుంచి ప్రతీ గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కడ్తాల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కడ్తాల మండల కేంద్రంలో చావు డప్పుమోగించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాడ్గుల మండలంలోని ఆయా గ్రామాలు, తండాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి పీఎం మోది దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, మండల వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారయణ, నాయకులు ఖలీల్, కౌన్సిలర్ రాధమ్మ, జడ్పీటీసీ అనురాధ, నిరంజన్గౌడ్, తలకొండపల్లి మండంలో మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.