ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన దుర్గం బాస్కర్యాదవ్కు రూ. 60వేల సీఎం సహాయనిధి చెక్కును క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, మండల యువత ప్రధాన కార్యదర్శి వెంకటేష్యాదవ్, నాయకులు గుండ్ల జంగయ్యయాదవ్, యాదయ్య, ప్రవీణ్కుమార్గౌడ్ పాల్గొన్నారు.