కడ్తాల్ : నూతనంగా ఏర్పాటైన కడ్తాల్ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి గుర్లకుంట తండా వరకు రూ. కోటితో నిర్మించనున్న బీటీ రోడ్డుకు సంబంధించిన ప్రొసిడింగ్ను నాయకులకు ఎమ్మెల్సీ అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, బంగారు తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయంలో గ్రామాలు, తండాలు అభివృద్ధికి అమడదూరంలో నిలిచాయని, పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు కొత్త రూపును సంతరించుకున్నాయని అన్నారు. గుర్లకుంట తండాకి బీటీ రోడ్డు మంజూరు సహకరించిన సీఎం కేసీఆర్కి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకరరావుకి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీని పలువురు నాయకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, నాయకులు భాస్కర్రెడ్డి, యాదగిరిరెడ్డి, జహంగీర్అలీ, వంశీధర్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి, ప్రభులింగం, రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.