పెద్దఅంబర్పేట : ఈ నెల 13న ఢిల్లీలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రోలర్ స్కేటింగ్ జాతీయస్థాయి పోటీలకు పెద్దఅంబర్పేట మున్సిపాల్లి 14వ వార్డుకు చెందిన రుతిజ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన రుతిజ అండర్ 11-14 సంవత్సరాల బాలికల విభాగంలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ తొండాపు రోహిణిరెడ్డి స్థానికులతో కలిసి మంగళవారం బాలికను అభినందించారు.
రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక కావడం తమ వార్డు పరిధిలోని బాలిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.