మాడ్గుల : మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజురూ చేయాలని కోరుతూ బుధవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నిరంజన్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. అందుగుల గ్రామంలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం, ఈదంపల్లి, అందుగుల గ్రామం నుంచి శిర్సనగండ్ల గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మాణం, గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజురుకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు అనిల్, జంగయ్యయాదవ్ పాల్గొన్నారు.