షాద్నగర్రూరల్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని ఆధ్యాత్మికతతోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని షాద్నగర్ కోర్టు నుంచి బదిలిపై వెళ్తున్న అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్యాంప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఫరూఖ్నగర్ మండలంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గదేవి అలంకరణతో ఉన్న భవానీమాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మల్లేశ్, చైర్మన్ కృష్ణయ్య ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, బెంది శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ మహేశ్వరి, సర్పంచ్ సాయిప్రసాద్, అర్ల యాదయ్య పాల్గొన్నారు.
దుర్గదేవిగా భవానీమాత
ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో బుధవారం అమ్మవారిని దుర్గదేవి అలంకరణతో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గురువారం అమ్మవారిని మహిషాసురమర్థిని రూపంతో అలంకరించి పూజలు చేయనున్నట్లు అర్చకులు భవానీశంకర్ తెలిపారు. ఈ పూజ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకు పాత్రులు కావాలన్నారు.