షాద్నగర్ : తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాదేర్గుల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో తెలంగాణ హాకీ జాతీయ జట్టును బుధవారం ఎంపిక చేశామని తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి పద్మాశ్రీ అర్జున అవార్డు గ్రహీత ముఖేష్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 2నుంచి 8వరకు కొనసాగిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో ప్రతిభ చూపిన క్రీడకారులను ఎంపిక చేసి తుది జట్టును ప్రకటించామని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపి బహుమతులను సాధించాలని కోరారు. ఈ నెల 14నుంచి 25వరకు తమిళనాడు రాష్ట్రంలో కోయల్పట్టిలో జాతీయ హాకీ పోటీలను నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో తెలంగాణ హాకీ జట్టు పాల్గొంటుందని పేర్కొన్నారు.
క్రీడకారులకు హాకీ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ కొండా విజయ్కుమార్, కార్యదర్శి భాస్కర్రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, స్థానిక పీడీ జాన్రెడ్డి, అడ్మిన్ భరత్రాజ్, కోచ్లు కిరణ్, రఘు, పాండు పాల్గొన్నారు.