కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి దైవ చింతన కలిగి ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో నిర్వహించిన యజ్ఞం కార్యక్రమంలో పాల్గొని పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాలు పూలమాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతలను ప్రతిష్ఠించడం ఎంతో మంచి కార్యక్రమమని అన్నారు.
గ్రామాల్లోని ఎక్కువశాతం గ్రామ దేవతలను పూజిస్తారని, గ్రామాల్లో గల దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దూలయ్య, బాల్రాజు, రాజు పాల్గొన్నారు.
పాఠశాలకు ఫ్యాన్లు బహుకరణ
కొందుర్గు కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు టీఆర్ఎస్ షాద్నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిపిరి రవియాదవ్ నాలుగు సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు. తన కుమారుడు సాయిచరణ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్లు బహుకరించినట్లు తెలిపారు. ఈ ఫ్యాన్లను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేతుల మీదుగా పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్నగర్ ఎంపీపీ ఇద్రిస్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కస్తూర్భా పాఠశాల ప్రత్యేక అధికారి నిస్సి, ఉపాధ్యాయులు సునీత, అనురాధ, రజిత, బాలనర్సమ్మ పాల్గొన్నారు.