మహేశ్వరం : ‘టీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి.. వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు ఉప్పెనలా తరలివచ్చి విజయవంతం చేయాలి..’ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతురాజునాయక్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే కరెంటు, నీటి కష్టాలు ఉండేవన్నారు. రైతులకు ఇబ్బందులు రానొద్దనే ఉద్దేశంతో రైతుబంధును అమలు చేస్తూ ఆదుకుంటుందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను కల్పిస్తూ నేరుగా అన్నదాతల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుందన్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్లతో ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ఆదుకుంటుందన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లను అందజేస్తూ కొం డంత అండగా రాష్ట్ర సర్కార్ నిలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటి ఇబ్బందులను తొలగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి నాయకులు కూన యాదయ్య, మండల రైతు బంధు చైర్మన్ రాఘవేందర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు దయాల శ్రీను, ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జంగయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, సర్పంచ్లు సాలివీరానాయక్, కంది రమేశ్, మెగావత్ రాజు నాయక్, థామస్ రెడ్డి, బండారి లావణ్యలింగం, మంత్రి రాజేశ్, గుత్తి పద్మాపాండు, ముక్కెర యాదయ్య, మద్ది కరుణాకర్రెడ్డి , పరిగి చంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీలు తొంట స్వప్నరవీందర్, విజయ్కుమార్, నడికూడి రమేశ్ పాల్గొన్నారు.