బొంరాస్పేట : మండలంలోని దర్పల్లి గ్రామానికి చెందిన మల్కయ్యకు రూ. లక్ష ఎల్వోసి ఉత్తర్వు కాపీని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో అందజేశారు. మల్కయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. చికిత్సకు అవసరమైన ఖర్చుల కోసం బాధితుడు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా రూ. లక్షలకు ఎల్వోసి మంజూరు చేసింది. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తుల్జారెడ్డి, అంజిలయ్య పాల్గొన్నారు.