జిల్లా వైద్యాధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు
షాద్నగర్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం తన కార్యాలయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వైద్యాధికారులు, సిబ్బందితో మాట్లాడారు. జనాభను నియంత్రించడంలో పురుషుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేయించుకునే విధంగా పురుషులకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ నెల 29నుంచి డిసెంబర్ 4వరకు కుటుంబ నియంత్రనపై ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కేవలం 5నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ పూర్తి అవుతుందన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్పై ఎలాంటి ఆపోహలకు తావులేదని చెప్పారు. ఈ నెల 30న సరూర్నగర్ పీహెచ్సీలో, డిసెంబర్ 1న శంషాబాద్ ఏరియా దవాఖానలో, డిసెంబర్ 2న షాద్నగర్ ఏరియా దవావాఖానలో, డిసెంబర్ 3న చేవేళ్ల, డిసెంబర్ 4న కందుకూరు సర్కారు దవాఖానాల్లో పురుషులకు కుటుంబ నియంత్రన ఆపరేషన్ల ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
జనాభ నియంత్రనపై గ్రామీణస్థాయిలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్. స్వరాజ్యలక్ష్మీ, పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, విద్యా శాఖ అధికారి సురేందర్రావు, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.