మంచాల : బాలికను వేదించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటకు మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం మంచాల సీఐ వెంకటేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అయిన కొర క్రాంతి బాలికను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడి వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో బాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.