నందిగామ : నందిగామ మండల కేంద్రంలోని శివరామాంజనేయస్వామి దేవాలయ 5వ వార్సికోత్సవం సందర్భంగా బుధవారం దేవాలయంలో వేదపండితులు మహా హోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కొమ్ముకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.