తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షడు దశరథ్నాయక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, నరోత్తంరెడ్డి, బాలకుమార్, బోళ్లశివ, రాజు, జగన్రెడ్డి, వెంకటయ్య, రమేశ్ పాల్గొన్నారు.