మర్పల్లి : గ్రామ సమస్యలు తెలుసుకునేందుకే మీతో నేను కార్యక్రమన్ని, పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మీతోనేను కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండ్లమర్పల్లి, పిల్లిగుండ్ల గ్రామాల్లో పర్యటించి ప్రజలను గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి పాలనాదక్షతో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని, పల్లెప్రగతి ద్వారా 50 ఏండ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు దూరమయ్యాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు కాఫీ కొడుతున్నాయన్నారు. మురుగు కాలువలు నిర్మించాలని, పొలాల వద్ద, గ్రామాల్లో కరెంటు వైర్లు వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి వాటిని సరిచేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా ప్రణాళిక సిద్ధం చేయలన్నారు. గుండ్లమర్పల్లిలో మురుగు కాలువల నిర్మాణానికి రూ. 4లక్షలు, పిల్లిగుండ్లలో మురుగు కాలువల నిర్మాణానికి రూ. 4లక్షలు, అలాగే పాఠశాల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ను వేరే చోటుకు మార్చేందుకు రూ. లక్ష మంజూరు చేస్తామన్నారు. విడుతల వారిగా ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కారిస్తామన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకొని వారికి అవగాహన కల్పించి 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా డిపో మేనేజర్తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వాటర్ ట్యాంకులను ప్రతి వారం శుభ్రం చేయాలని, అదే విధంగా తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు శివకుమార్, పాండు, జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, రైతుబంధు మండలాధ్యక్షుడు నాయబ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.