కొందుర్గు : గ్రామాల్లోని రైతులు ఎప్పుడు ఒకె పంట కాకుండ పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యాదమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం నిర్వహించిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను సంబధిత అధికారులు పరిష్కారం చేయలేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇవే కాకుండా మండలంలోని శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనల స్థలంలో నూతన పాఠశాల భవనలు ఏర్పాటు చేయలన్నారు. ధర్మ్యతండాలో నూతన అంగన్వాడీ భవనం ఏర్పాటు చేయాలని సర్పంచ్ హుంలీబాయి కోరారు. వైకుంఠధామం, రైతు వేదికల నిర్మాణాలు జరిగిన బిల్లులు రావడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
యాసంగిలో గన్ని బ్యాగుల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని సర్పంచ్లు తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వార మాట్లాడారు. గన్ని బ్యాగులకు సంబందించి ఇప్పటి వరకు డబ్బులు అందజేసినట్లు, మరి కొంతమందికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని తెలినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు గ్రామ పంచాయతీ నుంచి పంపితే మంజూరుకు కృషి చేస్తామన్నారు. వైకుంఠధామం, రైతు వేదికల డబ్బులు ఇప్పటి వరకు కొంత అందినట్లు తెలిపారు. ఇంకా రావాల్సిన బిల్లులు త్వరలో సంబంధిత ఖాతాలో జమ అవుతాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. గైర్హాజరు అయిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో తాసిల్దారు విజయ్కుమార్, జడ్పిటీసీ బంగారు స్వరూప, ఎంపీడీవో వసంతలక్ష్మి, వైస్ ఎంపీపీ అశ్రబేగం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.