కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుట్టిన పసి బిడ్డ నుంచి సచ్చే ముదసలి వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలంలోని ఉత్తరాశిపల్లి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వామని మాటల ప్రభుత్వం కాదని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్న ప్రతి పథకాన్ని నేరుగా అర్హులైనవాదరందరికీ అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, డీఎల్పీఓ సురేష్బాబు, ఎంపీడీఓ ఆంజనేయులు, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎదిర రామకృష్ణ, నర్సింహరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.