కొందుర్గు : కొందుర్గు మండలంలోని ముట్పూర్ గ్రామంలో పునఃనిర్మించిన దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు నవగ్రహా, ధ్వజస్తంభ, నాభిశిల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు. అదే విధంగా ఐదు రోజుల నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దేవాలయం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగానే ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పూజా కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ముందుకు సాగాలన్నారు. దేవాలయాన్ని పునఃనిర్మించడంతో పాటు విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉంటే ఇలాంటి మహోత్తరమైన భక్తి కార్యక్రమాలను గ్రామాల్లో జరుగుతుంటాయన్నారు. ప్రజల్లో భక్తి భావన కలిగి ఉంటే గ్రామంలో ఎలాంటి అలజడులు జరుగడానికి వీలు ఉండదన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ రాంరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, గ్రామస్తులు నర్సింలు, యాదయ్య పాల్గొన్నారు.