తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడ పరిధి 23వ వార్డు లక్ష్మీనగర్ కాలనికీ చెందిన జరుప్ల విజయ్ నాయక్ దంపతుల కుమారుడు జరుప్ల పవన్ కేరళలోని జాతీయ సాంకేతిక విద్య సంస్థలో కంప్యూటర్ సైన్స్లో సీటు సాధించాడు. ఆర్థిక స్థోమత రిత్యపై చదువులు చదివేందుకు ఇబ్బంది పడుతున్న పవన్కు మల్రెడ్డి సోదరులు రంగారెడ్డి, రాంరెడ్డి అతడి ప్రతిభను గుర్తించి ప్రముఖ కోచింగ్ సెంటర్లో తమ సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించి ఆర్థిక సహాయం అందజేశారు. పవన్ ఏకంగా కేరళలోని జాతీయ సాంకేతిక విద్య సంస్థలో కంప్యూటర్ సైన్స్లో సీటు సాధించాడు.
ఈ మేరకు పవన్ తన తల్లిదండ్రులతో కలిసి తనను ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందజేసిన మల్రెడ్డి సోదరులను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మల్రెడ్డి సోదరులు పవన్ను అభినందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు దేశ్యానాయక్, రాగ్యానాయక్, వడ్తా నాయక్, బిక్కు నాయక్, జటావత్ లచ్చు నాయక్, శ్రీను నాయక్, రాములు నాయక్ పాల్గొన్నారు.