షాద్నగర్ : రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5 నెలల పాటు పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ గురువారం తెలిపారు. బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 లోపుwww.tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5న ఉదయం 11గంటలకు అర్హత పరీక్షను నిర్వాహిస్తారని చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఫోన్ 040-23546552ను సంప్రదించాలని కోరారు.