ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రిటైడ్ ఆర్మీ జవాన్ రవి నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్పీ పెట్రోల్బంక్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇతరులపై ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ స్వశక్తితో ముందుకు సాగినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెంది, కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, సర్పంచ్ బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతిరెడ్డి, మండల తెరాస అధ్యక్షుడు బుగ్గరాములు, టీఆర్ఎస్ నాయకులు, జంగయ్య, శ్రీశైలం, సురేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు.